Friday, May 3, 2024

కేటీఆర్ ఉదార‌త‌..ఎస్కార్ట్ వాహ‌నంలో క్ష‌త‌గాత్రులు..

మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలోనే కాదు రియ‌ల్ గా కూడా ప‌లు విష‌యాల‌పై స్పందిస్తుంటారు. కాగా గ‌త రాత్రి ప్రమాదంలో గాయపడి రక్తమోడుతున్న విద్యార్థులను మంత్రి కేటీఆర్ తన కాన్వాయ్‌లో ఆసుపత్రికి తరలించారు. మియాపూర్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు హకీంపేట వద్ద గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.అదే సమయంలో కాన్వాయ్‌గా అటునుంచి వస్తున్న కేటీఆర్ గాయపడి రక్తమోడుతున్న యువకులను చూశారు. వెంటనే కారు ఆపి కిందికి దిగారు. ప్రమాదం గురించి తెలుసుకుని, రక్తమోడుతున్న విద్యార్థులను తన ఎస్కార్ట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. కేటీఆర్ చొర‌వ‌పై ప్ర‌శంస‌లు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement