Monday, May 6, 2024

టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఘన విజయం పట్ల రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం టిఆర్ఎస్ రాజకీయ ఆధిపత్యానికి నిదర్శన‌మ‌న్నారు. టిఆర్ఎస్ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని మరోసారి రుజువైందన్నారు. శాసన మండలిలోని స్థానిక సంస్థల కోటా నుంచి జరిగిన ఎన్నికలలో మొత్తం 12 స్థానాలు గెలవడం, క్లీన్ స్వీప్ చేయడం గర్వకారణం అని తెలిపారు.


ఈ 12 సీట్లలో 6 స్థానాలను ఏకగ్రీవంగా గెల్చుకోవడం, పోలింగ్ జరిగిన ఆరు స్థానాల్లో భారీ మెజారిటీతో గెలవడం టిఆర్ఎస్, సీఎం కెసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల నాయకత్వం పట్ల, వారి పరిపాలనా పటిమ పట్ల ప్రజల మన్ననలకి నిదర్శనం అన్నారు. ఈ ఎన్నికలలో ఎమ్మెల్సీలుగా ఘన విజయం సాధించిన భానుప్రసాదరావు, రమణ, విఠల్, యాదవరెడ్డి, కోటిరెడ్డి, మధులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నియమితులైన మధుసూదనాచారికి హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement