Thursday, April 25, 2024

మినీ బస్సు బోల్తా-12 మంది మృతి

మినీ బస్సు బోల్తా పడిన ఘటనలో ఏడుగురు మరణించారు..కాగా మరో బస్సు బోల్తాపడిన ఘటనలో ఐదుగురు మృతి చెందారు. కాగా ఈ ఘటనలో నేపాల్‌ లో చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో 31మంది తీవ్రంగా గాయపడ్డారు.కాఠ మాండూ నుంచి బిం గంజ్‌ వైపు వెళ్తున్న బస్సు మకవాన్‌ పూం వద్ద అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పొయారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా పశ్చిమనేపాల్‌ లోని క్యాంగసిబగం లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు..మరో 13మంది గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement