తెలంగాణ వ్యాప్తంగా రేపు (మంగళవారం) టీఎస్ ఆర్టసీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమం జరగనుంది. ఈమేరకు ఇవ్వాల (సోమవారం) టీఎస్ ఆర్టీసీ ఓ ప్రకటన జారీ చేసింది. తెలంగాణలోని 101 డిపోలలో రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. అందులో భాగంగా యాదగిరి గుట బస్ స్టేషన్లో రక్తదాన శిబిరం చేపట్టనున్నట్ట డీపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఉత్సాహవంతులైన యువతీ, యువకులు శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు.
![](https://cdn.prabhanews.com/wp-content/uploads/2023/06/WhatsApp-Image-2023-06-26-at-12.46.54-PM-1024x513.webp)