Wednesday, March 27, 2024

ఇండోనేషియా సుల‌వేసిలో భారీ భూకంపం.. సునామీ హెచ్చ‌రిక‌లు

మ‌రోసారి ఇండోనేషియా సుల‌వేసిలో భారీ భూకంపం సంభ‌వించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 6.1గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే (USGS) తెలిపింది. సులవేసి ప్రావిన్స్‌కి ఉత్తరాన 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న గొరొన్‌టాలోలో భూకంప కేంద్రం ఉన్నదని వెల్లడించింది. సముద్రంలో 145 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. దీనివల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. సునామీ హెచ్చరికలు జారీ చేశారు.కాగా రెండో రోజుల క్రితం కూడా ఇండోనేషియాలో భారీ భూకంపం వచ్చింది. సోమవారం ఉద‌యం 6:30 గంట‌ల‌కు సుమ‌త్రా దీవుల్లో భూమి కంపింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.2గా న‌మోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement