Saturday, May 18, 2024

ఆల‌యం, మ‌సీదు, చ‌ర్చి.. ఈ మూడింటిని త‌ప్ప‌కుండా నిర్మిస్తాం – మంత్రి కేటీఆర్

మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. ఎవ‌రు ఏం అడిగినా కాద‌న‌కుండా సాయాన్ని అందిస్తుంటారు. కాగా ఓ నెటిజ‌న్ నూత‌న స‌చివాల‌యంలో నిర్మిస్తామ‌న్న దేవాల‌యం అంశాన్ని ప్ర‌శాంత్ యాద‌వ్ అనే నెటిజ‌న్ ట్విట్ట‌ర్ వేదిక‌గా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆల‌యం, మ‌సీదు, చ‌ర్చి.. ఈ మూడింటిని త‌ప్ప‌కుండా నిర్మిస్తాం.. మీరేం ఆందోళ‌న చెంద‌కండి అని కేటీఆర్ సూచించారు. అన్ని మ‌తాల‌ను గౌర‌వించే సీఎం కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ ఉంద‌న్నారు. మ‌తం ముసుగులో రాజ‌కీయాలు చేయం అని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement