Saturday, May 4, 2024

Flash: ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

ఆర్థిక ఇబ్బందులతో ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన తొర్రూరు మండల కేంద్రంలో చోటుచేసుకుంది. సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దగ్గర ఏరియాలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపిన వివరాల ప్రకారం జనగామ జిల్లా కొడకండ్ల మండలంలోని పాకాల గ్రామానికి చెందిన రాచకొండ విజయ్ (30) అనే వ్యక్తి సోమవారం అర్ధరాత్రి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్సై తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని,వివరాలు సేకరించారు. విజయ్ అప్పుల బాధ కారణంగా తాగుడుకు బానిసై ఆత్మహత్యకు పాల్పడినట్లుగా నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి రాచకొండ లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. మృతుడికి భార్య,ఇద్దరు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement