Monday, May 13, 2024

రాష్ట్రపతి ఎన్నికపై.. ప్రతిపక్షాలకు మమతా బెనర్జీ లేఖ

ప్రతిపక్షాలకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నిక కోసం సమావేశం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈనెల 15వతేదీన మమత బెనర్జీ ప్రతిపక్షాలతో భేటీకానున్నారు. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సహా 8 రాష్ట్రాల సీఎంలకు పిలుపునిచ్చారు. అలాగే సోనియాగాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, సీతారాం ఏచూరీ, డి.రాజా, దేవెగౌడ, అఖిలేష్ యాదవ్ లకు అమె పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement