Monday, June 3, 2024

సైన్యానికి ఆహారం అందించిన నరేషుడు!

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో 50 లక్షల మంది పాల్గొన్నారు. వారికి వంట వండిన వారు ఎవరు? అన్న ఆసక్తికరమైన విషయంలోకి వెళితే- మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన కొంద రు, పాండవుల పక్షాన కొందరు ఇలా అందరూ కలిసి 50 లక్షలకు పైగా కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నారు. కానీ ఇంత జరుగుతున్నా ఇద్దరు రాజులు పాల్గొన లేదు. అందు లో ఒకరు విదర్భ రాజైన రుక్మి, రెండవది బలరాముడు. ఆ ఇద్దరు తప్ప అన్ని రాజ్యాలు పాల్గొన్నాయి.
దక్షిణ భారతంలోని ఉడిపి రాజ్యం కురుక్షేత్ర యుద్ధా నికి వచ్చింది. ఉడిపి రాజైన నరేషుడు సైన్యాన్ని తీసుకొని యుద్ధ ప్రాంతానికి వెళ్లినప్పుడు కౌరవులు తమ వైపు నిల బడాలని, మరోవైపు పాండవులు తమ వైపు నిలబడాలని కోరతారు. అప్పుడు ఉడిపి రాజు తన తెలివితో ఎటూ వెళ్ళ కుండా సలహా కోసం శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. ”అందరూ యుద్ధం గురించే ఆలోచి స్తున్నారు. మరి ఇన్ని లక్షల మందికి భోజనాల గురించి ఏమైనా ఆలోచించారా? ఎవరు వండి పెడతారు?” అని శ్రీకృష్ణుడిని అడుగు తాడు.
”మీరన్నది నిజమే మరి మీ దగ్గర ఏదైనా ఆలో చన ఉందా” అని నరేషుడుని శ్రీకృష్ణుడు అడుగుతాడు.
అప్పుడు నరేషుడు ”జరుగుతున్న ఈ మహా యుద్ధం అన్నదమ్ముల మధ్య నడుస్తున్నది,
నాకు ఈ యుద్ధంలో పాల్గొనడం ఇష్టం లేదు. అందు వల్ల నేను, నా సైన్యం ఇరువర్గాల యుద్ధంలో పాల్గొనము. వారందరికి భోజనం చేసి పెడతాము” అని ఉడిపిరాజు చెపుతాడు.అది విని శ్రీకృష్ణుడు ”రాజా! మీ ఆలోచన చాలా అద్భుతమైనది. 50 లక్షల మందికి భోజనం వండటం అంటే సామాన్యం కాదు. మీవల్లే సాధ్యమవుతుంది, అందరికీ భోజనాలు తయారుచేయమ”ని చెపు తాడు.
”50 లక్షల మందికి భోజనాలు వండాలంటే భీము డు, అతని సైన్యానికి మాత్రమే వీలవుతుంది కానీ ఈ సమ యంలో పోరాడటం భీముడుకు ముఖ్యం. అందువల్ల భీముడు యుద్ధక్షేత్రం వదిలి రాలేడు. అందువల్ల నువ్వొ క్కడివే ఇంతమంది సైన్యానికి వంట చేయగల సమర్ధు డవు” అంటాడు శ్రీకృష్ణుడు.
నరేషుడు తన సైన్యంతో కలిసి అక్కడ ఉన్న సైన్యాల కు భోజనం తయారు చేస్తాడు నరేషుడు ఎలా వండేవాడు అంటే.. సాయంత్రం వరకు తాను వండిన భోజనం ఒక్క మెతుకు కూడా మిగలకుండా, వృధాకాకుండా వండేవా డు. రోజులు గడుస్తున్న కొద్దీ సైన్యం కూడా తగ్గిపోయేది. అయినా సరే వంట మాత్రం అందరికీ సరిపోయేలా వండే వాడు నరేషుడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయే వా రు. ”ఇది ఎలా సాధ్యం? అంతమంది చనిపోతున్నా చివరి కి మిగిలినవారికి మాత్రమే సరిపోయేలా ఎలా వంట చేస్తు న్నారు, అదికూడా ఒక్క మెతుకు కూడా మిగలకుండా ఎలా వండుతున్నారు?” అని అందరూ ఆశ్చర్యానికి గురయ్యేవారు. అసలు నరేషునికి ఎలా తెలుస్తుంది? ఈ రోజు ఇంతమంది మాత్రమే చనిపోతారని, మిగిలినవారికి మాత్రమే భోజనం వండాలి అని?
ఇలా 18 రోజులు గడిచిపోయాయి. యుద్ధం ముగి సింది. పాండవులు గెలిచారు. పట్టాభిషేకం జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు ఉడిపి నరేషుడునితో ”మమ్మల్ని అం దరూ తక్కువ సైన్యం ఉన్నా గెలిచామని పొగుడుతున్నా రు. కానీ నేను మాత్రం నిన్ను మెచ్చుకోకుండా ఉండ లేక పోతున్నాను. ఎందుకంటే 50 లక్షల మంది సైన్యానికి వం ట చేయడం అంటే మాటలు కాదు. అదికూడా ఒక మెతు కు కూడా మిగలకుండా వృధా కాకుండా వండడం అంటే అసాధ్యం. ఇది మహా అద్భుతం ఇలా ఎలా చేశా వు?” అంటాడు.
అప్పుడు నరేషుడు నవ్వుతూ ”మీరు గెలిచారు కదా దాని గొెప్పతనం ఎవరికి ఇస్తా రు?” అని అడిగాడు.
యుధిష్టరుడు ”శ్రీకృ ష్ణుడే దీనికి మూలమని, మా విజయం గొప్పతనం మొత్తం శ్రీకృష్ణునికి చెందు తుంది” అని చెప్తాడు.
అప్పుడు నరేషుడు ”మీరు గెల వడానికే కాదు, నేను ఇంతమందికి సరిపడా వంట వండడానికి కూడా శ్రీకష్ణుడే కారణం. కాబట్టి ఈ గొప్పతనమంతా శ్రీకృష్ణునికే చెందుతుంది” అని చెప్తాడు. ఇదివిని సభలో ఉన్నవారంతా ఆశ్చర్యానికి గురవుతారు.
”ఇది ఎలా సాధ్యం? శ్రీకృష్ణుడు ఎలా కారణం” అని నరేషుడుని అడుగుతారు. దాంతో నరేషుడు అసలు ర#హ స్యాన్ని అందరి ముం దు ఇలా చెప్తాడు… శ్రీకృష్ణుడు ప్రతి రోజు రాత్రి పెసర కాయల ు తినేవాడు. నేను లెక్కపెట్టి పెట్టే వాడిని. శ్రీకృష్ణుడు తిన్న తర్వాత మళ్లిd పెసరకాయ లను లెక్కపెట్టే వాడిని. శ్రీ కృష్ణుడు ఎన్ని కాయలు అయితే తింటాడో దానికి వెయ్యి రెట్లు సైన్యం చనిపోయేవారు.. ఆంటే శ్రీకృష్ణుడు 50 పెసరకాయలు తింటే దానికి వెయ్యి రెట్లు అంటే 50 వేలమంది సైనికులు మరుసటి రోజు యుద్ధంలో చనిపోయేవారు. దీనిని బట్టి నేను మిగతా వారికి భోజనం వండే వాడిని. అందువల్ల ఏ రోజు కూడా భోజనం వృధా కాకుండా వండేవాడిని” అని చెప్పాడు.
ఇది విని ఆ సభలోని వారందరూ కృష్ణలీలకు ముగ్ధులవుతారు.ఈ కథ మహాభారత కథలలో ఒక అరు దైన కథ. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని కృష్ణ మందిరం లో ఈ కథ ఇప్పటికీ వినిపిస్తూ ఉంటారు.
– డా. చదలవాడ హరిబాబు
9849500354

Advertisement

తాజా వార్తలు

Advertisement