Monday, May 6, 2024

రాజ్య‌స‌భ ప్ర‌తిప‌క్ష నేత‌గా మల్లికార్జున ఖ‌ర్గే రాజీనామా

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, రాజ్య‌స‌భ ఎంపీ మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే.. ఆ పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీప‌డ‌నున్న విష‌యం తెలిసిందే. దీంతో రాజ్య సభలో ప్రతిపక్ష నేత ప‌ద‌వికి మల్లికార్జున ఖర్గే రాజీనామా చేశారు. ఆయన ఏఐసీసీ అధ్యక్ష పదవి ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక్క‌రికి ఒక‌టే ప‌ద‌వి అన్న నియ‌మం ప్రకారం. ప్రతిపక్ష నాయకుని పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో త‌న రాజీనామా లేఖ‌ను కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్య‌క్షురాలు సోనియా గాంధీకి పంపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement