Monday, April 29, 2024

ఒంగోలులో అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌యిన మ‌హానాడు – జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసిన చంద్ర‌బాబు

మ‌హానాడు కార్య‌క్ర‌మం ఒంగోలులో అట్ట‌హాసంగా ప్రారంభ‌మ‌యింది. టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు. అనంతరం ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ పాటతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పార్టీ కోసం ప్రాణాలను అర్పించిన కార్యకర్తలకు తొలుత నివాళి అర్పించారు. ఈ కార్యక్రమానికి వేలాదిగా తెలుగు తమ్ముళ్లు తరలి వచ్చారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కార్యక్రమం కావడంతో టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం ఉప్పొంగుతోంది. మరోవైపు ఈ కార్యక్రమం కోసం భారీ వేదికను ఏర్పాటు చేశారు. పార్టీకి చెందిన పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీలు ఇతర కీలక నేతలు దాదాపు 200 మందికి పైగా వేదికపై ఆసీనులయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement