Monday, April 29, 2024

Flash: చెట్టును ఢీకొట్టిన లారీ.. ఇద్దరికి తీవ్ర గాయాలు

మానకొండూర్ మండలం ముంజంపల్లి శివారులో కరీంనగర్ -వరంగల్ ప్రధాన రహదారి పై సీడ్ మిల్లుల సమీపంలో శనివారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో లారీ చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వైజాక్ నుంచి గుజరాత్ కు లోడుతో వెళ్తున్న ( AP 16 TE 6818 )నెంబర్ గల లారీ.. ముంజంపల్లి శివారులో చెట్టును బలంగా ఢీ కొట్టింది. దీంతో లారీ ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. ఈ ఘటనలో డ్రైవర్ కృష్ణకు తీవ్ర గాయాలు కాగా క్లినర్ మాధవకు స్వల్ప గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులు కృష్ణా జిల్లా వీర్లపాడ్ మండలం కంచిచెర్ల గ్రామానికి చెందివారుగు గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement