Sunday, April 28, 2024

Flash: ఎద్దుల బండిని ఢీకొట్టిన లారీ…ఒకరు మృతి

అనంతపురం జిల్లాలోని పామిడి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ఎద్దుల బండిని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చితంబరి అనే వ్యక్తి మృతి చెందాడు. రెండు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. పెన్నా నదిలో ఇసుక తీసుకురావడానికి ఎద్దుల బండిని తెల్లవారుజామున 4 గంటల సమయంలో అటుగా వస్తున్న సిమెంటు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎద్దుల బండి చాలకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మరణించిన వ్యక్తి పామిడి మండలం ఎద్దులపల్లి రోడ్డు రైల్వే గేట్ ప్రక్కన నివాసం ఉంటున్న చిదంబరిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement