Monday, March 18, 2024

కేటీఆర్ vs బండి… ట్విట్టర్ లో పంచాగ శ్రావణ వార్

హైదరాబాద్ – తెలంగాణలో రాజకీయాలు ఫుల్ హీటెక్కిస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కామ్, టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల లీకేజీ ఘటనలు అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు మంత్రి కేటీఆర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఉగాది సందర్భంగా తమదైన శైలిలో పంచాంగం చెప్పారు. బస్, బభ్రాజీమానం భజగోవిందం అంటూ కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేయగా.. ‘తుస్.., పిట్టల దొర’ అంటూ బండి సంజయ్ కూడా అదే రీతిలో కౌంటర్ ఇచ్చారు.

ఆదాయం: అదానీకి!

వ్యయం: జనానికి, బ్యాంకులకు!

అవమానం: నెహ్రూకి!

రాజపూజ్యం: గుజరాతీ గుంపుకి!

- Advertisement -

!బస్, బభ్రాజీమానం భజగోవిందం!దేశీయ ఉగాది పంచాంగం సమాప్తం!..’ అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. కేటీఆర్ చేసిన ట్వీట్‌కు కౌంటర్‌గా బండి సంజయ్ కూడా పోస్ట్ చేశారు

ఆదాయం: కల్వకుంట్ల కుటుంబానికి

వ్యయం: తెలంగాణ రాష్ట్రానికి

అవమానం: ఉద్యమ వీరులకు, అమరుల త్యాగాలకు

రాజపూజ్యం: ఉద్యమ ద్రోహులకు, దొంగలకు

!!తుస్.., పిట్టల దొర, తుపాకి చంద్రుల గడీల పంచాతీ లెక్క తేలుడే తరువాయి.. పతనం ఇగ షురువాయే..’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement