Monday, April 29, 2024

హుజురాబాద్ బరిలో కొండా.. కానీ…

హుజురాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో కాంగ్రెస్ అభ్య‌ర్థి ఎవరు అన్న దానిపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతోంది. మాజీ మంత్రి కొండా సురేఖకు టికెట్ ఖరారు అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే, పార్టీలోని కొంద‌రు నేతల స్థానిక నేత‌ల వైపు మొగ్గుచూపుతుంటే… మ‌రికొంద‌రు మాత్రం మాజీ మంత్రి కొండా సురేఖ వైపు మొగ్గుచూపుతున్నారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎన్నిక‌ల క‌మిటీ చైర్మ‌న్ దామోద‌ర రాజ‌న‌ర్సింహ సైతం కొండా వైపుకే మొగ్గుచూపుతున్నారు. కొండా పాత నియోజ‌క‌వ‌ర్గం ప‌ర‌కాల‌కు హుజురాబాద్ ఆనుకొని ఉండ‌టం, మంత్రిగా కొండాకు ఈ ప్రాంతంపై అవ‌గాహ‌న ఉండ‌టంతో గ‌ట్టి అభ్య‌ర్థిగా కొండా సురేఖ అయితేనే బెస్ట్ అంటూ పార్టీ వ‌ర్గాలు మొగ్గుచూపుతున్నాయి.

తాజాగా సురేఖ హుజురాబాద్ లో పోటీపై క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం కోరితే తాను హుజురాబాద్ బ‌రిలో ఉంటాన‌ని స్ప‌ష్టం చేశారు. గ‌ట్టి అభ్య‌ర్థిగా పార్టీ త‌న‌ను పోటీ చేయాల‌ని కోరితే కాదు అన‌ని… అయితే, అధికారికంగా పార్టీ పెద్ద‌ల నుండి త‌న‌కు ఎలాంటి స‌మాచారం లేద‌న్నారు. అయితే, తాను హుజురాబాద్ నుండి పోటీ చేసినా వ‌రంగ‌ల్ ను విడిచిపెట్ట‌న‌ని… తాను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌ళ్లీ పాత నియోజ‌క‌వ‌ర్గానికే వ‌స్తాన‌ని కొండా సురేఖ స్ప‌ష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement