Wednesday, May 1, 2024

నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఖాళీలు ఎలా తగ్గాయి?

రాష్ట్రంలో భారీగా ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్లు సీఎం కేసీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రకటన కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భిన్నంగా స్పందించారు. సీఎం ప్రకటన తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అని అన్నారు. లక్షకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే 80 వేలు మాత్రమే భర్తీ చేస్తామనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను భర్తీ చేస్తానని సీఎం చెప్పారని గుర్తు చేశారు. ప్రభుత్వమే నియమించిన బిస్వాల్ కమిటీ లక్షా 91 వేలు ఖాళీలు ఉన్నాయని గత ఏడాది నివేదిక ఇచ్చిందని తెలిపారు. మధ్యలో ఏ నోటిఫికేషన్లు ఇవ్వకుండానే ఆ ఖాళీలు ఎట్ల తగ్గిపోయాయని అని కోమటిరెడ్డి ప్రశ్నించారు.  2018 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్.. దానిని తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. ఆ సమయంలో ఓట్ల కోసమే ప్రకటన చేశారని, తర్వాత దాని ఊసే ఎత్తలేదని విమర్శించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేనందున నిరుద్యోగ భృతి ఇవ్వలేకపోతున్నామంటూ యువతకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఎంపీ కోమటిరెడ్డి డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement