Thursday, April 25, 2024

Karnataka: కూలిన శిక్ష‌ణ విమానం.. పైలెట్లు క్షేమం..

క‌ర్నాట‌క రాష్ట్రంలో భార‌త వైమానిక ద‌ళానికి చెందిన కిర‌ణ్ శిక్ష‌ణ విమానం నేల‌కూలింది. చామ‌రాజ‌న‌గ‌ర్‌లోని మాకాలి గ్రామంలో ఆ విమానం క్రాష్ అయ్యింది. అయితే ఆ విమానంలో ఉన్న ఇద్ద‌రు పైలెట్లు పారాచూట్ సాయంతో క్షేమంగా బయటపడ్డారు. లేడీ పైలెట్ కూడా క్షేమంగా ఉన్న‌ట్లు అధికారులు చెప్పారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల విచార‌ణ‌కు ఆదేశించిన‌ట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్ల‌డించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement