Sunday, April 28, 2024

ఇట్స్ మై ల‌గ్గం టైమ్ అంటున్న క‌త్రినా.. ఆ కార్య‌క్ర‌మం కూడా అయిపోయింద‌ట‌..

బాలీవుడ్‌ లవ్‌ బర్డ్స్ నటి కత్రినాకైఫ్‌, నటుడు విక్కీకౌశల్‌ త్వరలో ఏడడుగుల బంధంలోకి అడుగుపెట్టనున్నార‌ని కొన్నిరోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. కాగా, డిసెంబర్ లోనే వీరి ల‌గ్గానికి ముహూర్తం కుదిరింద‌ని బీటౌన్‌లో ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో విక్కీ-కత్రినాలకు దీపావళి రోజు రోకా ఫంక్షన్‌ జరిగినట్లు సమాచారం. కత్రినాకు ఎంతో ఆప్తుడైన దర్శకుడు కబీర్‌ఖాన్‌ నివాసంలో ఈ వేడుక నిర్వహించిన‌ట్టు తెలుస్తోంది.

కత్రినా, ఆమె తల్లి సుజానే టర్కోయెట్, ఇసాబెల్, విక్కీ, ఆయన తల్లిదండ్రులతోపాటు సోదరుడు సన్నీ కౌశల్‌ ఈ వేడుకలో పాల్గొని.. వివాహానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడుకున్నారట. ఇరు కుటుంబాలు పలు ఖరీదైన బహుమతులను కూడా ఇచ్చిపుచ్చుకున్నారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

మరోవైపు, ఉత్తర భారతదేశంలో రోకా ఫంక్షన్‌కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. వధూవరుల కుటుంబసభ్యులు ఒకచోట కలుసుకుని పెళ్లి తంతు, కట్నకానుకలపై మాట్లాడుకుని.. అన్నీ ఓకే అనుకున్నాక స్వీట్స్‌, ఖరీదైన బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.

విక్కీ-కత్రినా కొన్ని సంవత్సరాల నుంచి ల‌వ్‌లో ఉన్నారు. కత్రినా అంటే తనకెంతో ఇష్టమని ఇప్పటికే పలు సందర్భాల్లో విక్కీ బయటపెట్టారు. మరోవైపు కత్రినా సైతం విక్కీపై అమితమైన అభిమానాన్ని కనబరిచారు. విక్కీ నటించిన సినిమాలపై ప్రశంసల వర్షం కురిపించారు. మరోవైపు డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సెస్‌ ఫోర్ట్‌లో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement