Sunday, April 28, 2024

క‌త్రినా .. విక్కీల పెళ్లి .. లైవ్ ఇస్తే రూ. వంద కోట్లు ..

బాలీవుడ్ న‌టులు .. క‌త్రినాకైఫ్ .. విక్కీ కౌశ‌ల్ వివాహ వేడుక‌ను ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేసేందుకు పెద్ద ఓటీటీ సంస్థ బంప‌ర్ ఆఫ‌ర్ ని ప్ర‌క‌టించింద‌ట . ఈ మేర‌కు వారికి రూ. వంద కోట్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించ‌డం విశేషం. డిసెంబ‌ర్ 9న వీరి వివాహం జ‌ర‌గ‌నుంది.. కాగా పాశ్చాత్య దేశాల్లో సెలెబ్రిటీలు తమ పెళ్లిళ్లకు సంబంధించిన ప్రసారాలను అమ్ముకోవడం సర్వసాధారణం. మ్యాగ్ జైన్స్ , చానెళ్లకు వీడియోలు, ఫొటోలు ఇస్తుంటారు. ఇప్పుడు భారత్ లోనూ అదే ట్రెండ్ తీసుకొచ్చేందుకు ఓ ఓటీటీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ లకు రూ.100 కోట్లు ఆఫర్ చేసిందనే విష‌యాన్ని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్ల‌డించాయి. వాళ్లు ఓకే అనడమే ఆలస్యం వారి పెళ్లికి సంబంధించిన ప్రతి క్షణాన్ని లైవ్ ప్రసారం చేస్తారని అంటున్నారు. లైవ్ ప్రసారంలో భాగంగా పెళ్లి లైవ్ ఫుటేజి, పెళ్లికి వచ్చిన అతిథులు, తారలు, కుటుంబసభ్యులు, బంధువులు, స్నేహితులు, స్టైలిస్టుల చిట్టిపొట్టి ఇంటర్వ్యూల వంటి వాటిని టెలికాస్ట్ చేస్తారని చెబుతున్నారు. మ‌రి క‌త్రినా, విక్కీలు ఏమంటారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement