Tuesday, May 21, 2024

జావేద్ అక్త‌ర్ పై కంగ‌నార‌నౌత్ ఆరోప‌ణ‌లు-వ‌చ్చే నెల 4న ముంబై కోర్టుకు హాజ‌రుకానున్న న‌టి

బాలీవుడ్ ప్ర‌ముఖ గీత ర‌చ‌యిత జావేద్ అక్త‌ర్ పై ఓ ఇంట‌ర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగ‌నార‌నౌత్ ఆరోప‌ణ‌లు చేశారు.బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావిస్తూ.. బాలీవుడ్ లో కొందరిని తొక్కివేసేందుకు ఓ కోటరీ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఆ కోటరీలో జావేద్ అక్తర్ భాగమంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్లు తన పరువుకు నష్టం కలిగించాయంటూ అదే నెలలో జావేద్ అక్తర్ కోర్టులో కేసు వేశారు. దానిపై విచారణ కొనసాగుతోంది. దాంతో కంగనా రనౌత్ వచ్చే నెల 4న ముంబై కోర్టులో హాజరుకానున్నారు. బాలీవుడ్ ప్రముఖ గీత రచయిత జావేద్ అక్తర్ వేసిన పరువు నష్టం కేసులో ఆమె సోమవారమే మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరుకావాల్సి ఉంది. అయితే పలు కారణాల వల్ల ఈ ఒక్క రోజుకు వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆమె లాయర్ కోరడంతో.. కేసు విచారణను వచ్చే నెల 4న చేపట్టేందుకు న్యాయమూర్తి అంగీకరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement