Sunday, April 28, 2024

BREAKING: వైసీపీ ఎమ్మెల్యే కన్నుమూత

కడప జిల్లా వైసీపీ నేత, బద్వేలు నియోజకవర్గ ఎమ్మెల్యే డా. వెంకట సుబ్బయ్య ఆదివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని తన నివాసానికి చేరుకున్నారు. అనంతరం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ చురుకుగా పాల్గొన్నారు. అనంతర మళ్లీ అనారోగ్యానికి గురైన ఎమ్మెల్యే కడపలోని అరుణాచల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కాగా ఆయన మృతి పట్ల సీఎం జగన్, పలువురు నేతలు సంతాపం తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement