Saturday, April 20, 2024

బొటానికల్ గార్డెన్ లో రన్ ఫర్ పీస్.. ప్రారంభించిన జోగినిపల్లి సంతోష్ కుమార్

బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవ్వాల ఉద‌యం నిర్వహించిన 10K, 5K, 3K రన్ ఫర్ పీస్ ను జెండా ఊపి ప్రారంభించారు రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ . ఆదివారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పుర‌స్క‌రించుకుని బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రన్ ఫర్ పీస్ నిర్వహించడం చాలా శుభ పరిణామం అని, దీనికి ఇంత పెద్ద ఎత్తున హాజరైన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.

రోజు ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండే మనం వ్యాయామం చేయడం మర్చిపోతున్నామని, కానీ బొటానికల్ గార్డెన్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని అన్నారు.

ఈ గార్డెన్ అభివృద్ధి కోసం అసోసియేషన్ వారు చాలా కృషి చేస్తున్నారని వారికి తమ మద్దతు ఎప్పుడు ఉంటుందని తెలియజేశారు. ఈ గార్డెన్ లో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల కోసం తన రాజ్యసభ నిధులనుండి 10 లక్షల రూపాయలను కేటాయిస్తున్నానని తెలియజేశారు.

- Advertisement -

సంతోష్ ప్రకటనను స్ఫూర్తిగా తీసుకొని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి రెడ్డి, స్థానిక శాసనసభ్యుడు అరికెపూడి గాంధీ, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి కూడా వారి అభివృద్ధి నిధుల నుండి తలా 10 లక్షల రూపాయలు ప్రకటించారు.

కార్యక్రమంలో స్పోర్ట్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, PCCF డోబ్రియేలు, వాకర్ అసోసియేషన్ ప్రతినిధులు భరత్ రెడ్డి, బాలకృష్ణ ఏవీ రెడ్డి, పెద్ద ఎత్తున వాకర్సు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement