Friday, April 26, 2024

Flash: జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమైయ్యారు. రెండు వేర్వేరు చోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో ఐదుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు మరణించారు. 12 గంటల వ్యవధిలో ఈ రెండు ఎన్ కౌంటర్లు జరిగాయి. కాశ్మీర్‌లోని పుల్వామా, బుద్గామ్ జిల్లాల్లో రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌లకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. జైషే మహ్మద్ అగ్ర కమాండర్ జాహిద్ వనీ ఈ ఎన్‌కౌంటర్లలో హతమయ్యాడని పోలీసులు తెలిపారు.

కాగా, పుల్వామాలో శనివారం సాయంత్రం నైరా ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్ లో జైష్-ఎ-మహ్మద్‌కు అనుబంధంగా ఉన్న నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement