Saturday, May 18, 2024

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంట‌ర్ : ఒక ఉగ్ర‌వాది హ‌తం

ద‌క్షిణ‌కాశ్మీర్ జిల్లా అవంతి పోరాలోని బ‌రాగామ్ ప్రాంతంలో భ‌ద్ర‌తా బ‌ల‌గాలు, ఉగ్ర‌వాదుల‌కు మ‌ధ్య ఎన్ కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ టెర్ర‌రిస్ట్ ని హ‌త‌మొందించారు. కాగా మ‌ర‌ణించిన ఉగ్ర‌వాదిని గుర్తించే ప‌నిలో ఉన్నారు అధికారులు. ఇటీవల కాలంలో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల కార్యకలాపాలు మెల్లిగా పెరుగుతుండటంతో పోలీసులు, భద్రతా బలగాలు కూడా అప్రమత్తంగా ఉంటున్నాయి.

పక్కాసమాచారంతో కూంబింగ్, కార్డన్ సెర్చ్ చేస్తున్న సమయంలో ఎదురుకాల్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు, సీఆర్ఫీఎఫ్ బలగాలు సంయుక్తంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. ఉగ్రవాదుల ఉన్నట్లు వచ్చిన పక్కా సమచారంతో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తుండగా.. ఉగ్రవాది కాల్పులు జరిపాడు. దీంతో భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడిలో టెర్రరిస్ట్ ను మట్టుబెట్టారు. ఘటన జరిగిన ప్రదేశంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement