Thursday, April 25, 2024

ప్రధానికి అండగా నిలుద్దాం.. జార్ఖండ్ సీఎంకు జగన్ సూచన

కరోనాపై పోరాటంలో ప్రధాని మోదీకి అందరూ అండగా నిలవాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. ముఖ్యమంత్రులు చెప్పేది ప్రధాని మోదీ వినడం లేదంటూ.. జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌ చేసిన ట్వీట్‌ పై జగన్‌ స్పందించారు. ఇది కొవిడ్‌పై యుద్ధంలో వేలెత్తి చూపే సమయం కాదన్నారు. ప్రధానికి అండగా నిలవాల్సిన సమయమని హేమంత్‌ సోరెన్‌ కు జగన్‌ సూచించారు.

కాగా, కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలకు తగినంత ఆక్సిజన్‌ తోపాటు టీకాలు సరఫరా చేయడం లేదంటూ చాలా మంది సీఎంలు కేంద్రం తీరును తప్పుబట్టారు. ఈ క్రమంలోనే జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్ సైతం ప్రధానిని విమర్శిస్తూ ట్వీట్‌ చేశారు. జార్ఖండ్ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో లాక్ డౌన్ ను అమలు చేస్తున్నారు. కరోనా వైరస్ కట్టడి చేయడానికి లాక్ డౌన్ తప్పనిసరి అయిందని సీఎం హేమంత్ సోరెన్ తెలిపారు.

ఇదీ చదవండి: జగన్ బెస్ట్ సీఎం… నెంబర్ ఎంతో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement