Thursday, April 25, 2024

వృద్ధుడికి జాక్ పాట్.. లాట‌రీలో రూ.5కోట్లు

గ‌త 35సంవ‌త్స‌రాలుగా లాట‌రీ టిక్కెట్స్ ని కొంటున్నాడు మ‌హంత్ ద్వార‌కా దాస్. ఇప్పుడు అత‌ని వ‌య‌సు 88సంవ‌త్స‌రాలు.
పంజాబ్‌ రాష్ట్రం దేరబస్సికి చెందిన మహంత్‌ ద్వారకా దాస్‌ అనే 88 ఏళ్ల వృద్ధుడికి.. లాటరీలంటే మహా ఇష్టం. తరచూ లాటరీ టికెట్లు కొనుగోలు చేసి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండేవాడు. ఈ క్రమంలో లోహ్రీ సందర్భంగా కొన్ని రోజుల క్రితం విక్రయించిన లాటరీ టికెట్‌ను కొనుగోలు చేశాడు. ఈ సంక్రాంతి బంపర్‌ లాటరీలో అతనికి జాక్‌పాట్‌ తగిలింది. ఏకంగా రూ.5కోట్లు గెలుచుకున్నాడు. గెలుచుకున్న మొత్తంలో కటింగ్స్‌పోను రూ.3.5 కోట్లు ద్వారకా దాస్‌కు అందించనున్నట్లు లాటరీ నిర్వాహకులు లోకేశ్‌ తెలిపారు.లాటరీలో రూ.5కోట్లు గెలుపొందడం పట్ల మహంత్‌ సంతోషం వ్యక్తం చేశాడు. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నా. గత 35-40 సంవత్సరాలుగా లాటరీలు కొంటున్నా. గెలిచిన మొత్తాన్ని నా ఇద్దరు కుమారులతోపాటు ‘డేరా’కు సమానంగా పంచుతా’ అని మహంత్‌ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement