Monday, May 20, 2024

Breaking: ట్రై కలర్స్ కంపెనీపై ఐటీ దాడులు

ట్రై కలర్స్ కంపెనీపై ఇన్ కం ట్యాక్స్ (ఐటీ) దాడులు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా 16చోట్ల ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ట్రై కలర్స్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. హైదరాబాద్ లోని 10 ప్రాంతాల్లో ఐటీ తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, ముంబై, పాట్నా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై సహా పలు పట్టణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విదేశాల్లోనూ ట్రై కలర్స్ వ్యాపారాలు జరుగుతున్నాయి. ఈ తనిఖీల్లో అధికారులు భారీగా నగదును గుర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement