Friday, April 19, 2024

ముంబై వ‌చ్చిన ఈషా అంబానీ.. ఘ‌న‌స్వాగ‌తం ప‌లికిన త‌ల్లిదండ్రులు

ఈషా అంబానీ త‌ల్లి అయిన నెల‌రోజుల త‌ర్వాత ముంబైకి వ‌చ్చింది. దాంతో ముకేష్ అంబానీ కుటుంబ‌స‌భ్యులు, బంధువులు ఈషా, ఆనంద్‌ల‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈషా పాప‌ను ఎత్తుకున్న‌ ఫొటోలు నెట్టింట్లో వైర‌ల్ అవుతున్నాయి. మ‌న‌వ‌డు, మ‌న‌వ‌రాలితో త‌మ కూతురు, అల్లుడు స్వ‌దేశం రావ‌డంతో అంబానీ కుటుంబం ఆనందంలో మునిగిపోయారు. నీతా అంబానీ మ‌న‌వ‌రాలిని ఎత్తుకొని మురిసిపోయింది. అంతేకాదు వ‌ర్లీలోని ఆనంద్‌, ఈషా అంబానీల ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. న‌వంబ‌ర్ 19న ఆమె ఆదియా, కృష్ణ అనే క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన విష‌యం తెలిసిందే. న‌వంబ‌ర్ 19న ఆమె ఆదియా, కృష్ణ అనే క‌వ‌ల పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈషా, ఆనంద్‌లు 2018లో వివాహం చేసుకున్నారు. ముంబైలోని ముకేష్ అంబానీ నివాసం అంటిలియాలో వీళ్ల పెళ్లి వైభవంగా జ‌రిగింది. ఈ ఏడాది ఆగ‌ష్టులో ఈషాకు ముకేష్‌ రిల‌య‌న్స్ గ్రూప్ రిటైల్ వ్యాపారం బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement