Tuesday, April 30, 2024

ప్రభుత్వాలను ప్రశ్నించడమే షర్మిల తప్పా ?.. విజయమ్మ

ప్రభుత్వాలను ప్రశ్నించడమే షర్మిల తప్పా అని వైఎస్ విజయమ్మ ప్రశ్నించారు. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. అయితే చంచల్ గూడ జైలులో ఉన్న షర్మిలను విజయమ్మ పరామర్శించారు. ఈసందర్భంగా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ… ఇంటి నుంచి బయటకు వెళ్లే స్వేచ్ఛ కూడా షర్మిలకు లేదా అన్నారు. ప్రశ్నించేవారిని ఎంతకాలం అణిచివేస్తారని అన్నారు. షర్మిలకు బెయిల్ వస్తుందని అనుకుంటున్నట్లు విజయమ్మ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement