Tuesday, April 30, 2024

IPL : ఆర్సీబీ, పంజాబ్ మధ్య ముగిసిన ఫస్ట్ ఇన్నింగ్స్..

ఐపీఎల్ 15 సీజ‌న్‌లో భాగంగా పంజాబ్, బెంగ‌ళూరు మ‌ధ్య జ‌రుగుతున్న మూడో మ్యాచ్‌లో బెంగ‌ళూరు ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవ‌ర్ల‌లో బెంగ‌ళూరు 205 ప‌రుగులు చేసింది. ఈ సీజ‌న్ లో బెంగ‌ళూరుకి కెప్టెన్ వ్య‌వ‌హ‌రిస్తున్న‌ డుప్లెసిస్ అర్ధ శ‌త‌కంతో జ‌ట్టును ఆదుకున్నాడు. 57 బంతుల్లో 88 ప‌రుగులు చేశాడు. ఆర్ సీబీ మాజీ సార‌థి విరాట్ కోహ్లీ 29 బంతుల్లో 41 ప‌రుగులు చేయ‌గా, దినేశ్ కార్తీక్ 14 బంతుల్లో 32 ప‌రుగులు, అనుజ్ రావ‌త్ 20 బంతుల్లో 21 ప‌రుగులు చేశారు. 2 వికెట్ల న‌ష్టంతో 205 ప‌రుగులు చేసి.. పంజాబ్‌కు 206 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని బెంగ‌ళూరు నిర్ధేశించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి...

Advertisement

తాజా వార్తలు

Advertisement