Tuesday, April 30, 2024

IPL 22: మార్చి 26 నుంచి ఐపీఎల్ ప్రారంభం

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులకు మంచి శుభవార్త అందించింది. ఐపీఎల్ 2022 నిర్వహణకు ముహూర్తం ఖరారు చేసింది. క్రికెట్, ఐపీఎల్ ప్రియులకు బీసీసీఐ శుభవార్త చెప్పింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన సమావేశంలో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణకు ముహూర్తం ఫిక్స్ చేసింది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 2022 సీజన్ ను ప్రారంభించాలని నిర్ణయించింది. తొలుత మార్చి 27నుంచి సీజన్ ను ప్రారంభించాలని బీసీసీఐ భావించింది. కానీ.. ఐపీఎల్ ప్రసార భాగస్వామి అయిన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ మార్చి 26న టోర్నీని స్టార్ట్ చేయాలని అభ్యర్థించింది. దీంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అభ్యర్థన మేరకు మార్చి 26 నుంచి ఐపీఎల్ సీజన్ 15 ను ప్రారంభించేందుకు బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని జాతీయ మీడియా వెల్లడించింది. కాగా.. ఈ ఏడాది భారత్ లో కరోనా తగ్గుముఖం పట్టడంతో.. ఐపీఎల్ 2022 సీజన్ మొత్తాన్ని(70 మ్యాచ్ లు) మహారాష్ట్రలోనే నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ముంబై, పూణెలలో ఉన్న క్రికెట్ స్టేడియంలలో ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి. ఈ క్రికెట్ లీగ్ కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ ను అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని ఐపీఎల్ ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement