Sunday, May 5, 2024

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న భారత్, ఆసీస్ టీమ్ లు

భారత్, అస్ట్రేలియా క్రికెట్ జట్ల సభ్యులు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్ జట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోవడంతో ఎయిర్ పోర్టు వద్ద ఆటగాళ్లకు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎయిర్ పోర్టులో డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలుచేశారు. రేపు భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా జట్లు మూడో టీ 20 ఆడనున్నాయి.. ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా ప్లేయర్స్ హోటల్ కు వెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement