Monday, April 29, 2024

India Corona: దేశంలో 24 గంటల్లో 247 మంది మృతి

దేశంలో కరోనా రోజూ వారీ కేసులు తగ్గతున్నాయి. గతంలో పొల్చితే.. ప్రస్తుతం రోజుకు 10 వేల కన్నా తక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం దేశంలో గడిచిన 24 గంటల్లో 6,984 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 247 మంది కరోనా బారిన పడి మరణించారు. అదే సమయంలో మొత్తం 8,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 87,562గా ఉంది.ఇప్పటి వరకు 3,41,46,931 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 1,34,61,14,483 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement