Monday, April 29, 2024

COVID19 : దేశంలో 24 గంటల్లో 6,531 కరోనా కేసులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత కొద్ది రోజులుగా 10 వేల కంటే దిగువ కేసులునమోదు అవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 6,531 కరోనా కేసులు నమోదు అయాయి. అదే సమయంలో 7,141 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 75,841గా ఉంది.  రికవరీ రేటు 98.40%గా ఉంది.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,47,93,333 కు చేరింది. ఇందులో 3,36,41,175 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో ఇప్పటి వరకు 4,79,997 మంది మరణించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,41,70,25,654 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement