Friday, April 26, 2024

దేశంలో కొత్తగా 38,948 కేసులు..

దేశంలో కరోనా కేసులు నిన్నటితో పొల్చితే స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 38,948 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి ఇప్పటివరకు కొత్తగా 43,903 మంది కోలుకోగా, 219 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసుల్లో ఒక్క కేరళలోనే 26,701 పాజిటివ్‌ కేసులు ఉన్నాయని, 74 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం 4,04,874 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు మొత్తం కేసుల సంఖ్య 3,30,27,621కు చేరింది. ఇందులో 3,21,81,995 మంది బాధితులు కోలుకున్నారు. 4,40,752 మంది వైరస్‌ తో మరణించారు.

దేశవ్యాప్తంగా 68,75,41,762 కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 53,14,68,867 నమూనాలకు కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ICMR‌) ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement