Sunday, May 5, 2024

India Corona: దేశంలో కరోనా ఖతం.. 24 గంటల్లో 2568 కేసులే..

దేశంలో కరోనా మహమ్మారి కేసులు పూర్తిగా తగ్గాయి. నెల రోజు క్రితం వరకు 10 వేల పైచిలుకు కేసులు నమోదు కాగా.. ప్రస్తుతం ఆ సంఖ్య నాలుగు వేలకు చేరింది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2568 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనాతో  97 మంది బాధితులు మరణించారు.  అదే సమయంలో దేశ వ్యాప్తంగా 4722 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 33,917 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 4,29,96,062 కు చేరింది. ఇందులో 4,24,46,171 మంది బాధితులు కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,80,40,28,891 కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement