Friday, May 17, 2024

Covid-19: దేశంలో కొత్తగా 2.85 లక్షల కేసులు.. 665 మరణాలు

దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,85,914 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా ధాటికి 665 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మహమ్మారితో మృతి చెందిన వారి సంఖ్య 4,91,127కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,99,073 మంది కరోనా నుంచి కోలు కున్నారు.

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,00,85,116 కు చేరింది. ఇందులో మొత్తం 3,73,70,971 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 22,23,018 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి.

మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్క రోజే 59,50,731 మందికి కరోనా వ్యాక్సిన్లు అందించారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,63,58,44,536 మందికి కోవిడ్ టీకాలు అందించినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement