Saturday, May 11, 2024

Covid-19: దేశంలో కొత్తగా 3993 కరోనా కేసులు.. 108 మరణాలు

భారత్ లో కరోనా మహమ్మారి కేసులు భారీగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 3993 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్ తో 108 మంది బాధితులు మరణించారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 5,15,210కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 8055 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 49,948 యాక్టివ్ కేసులు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనా పాజిటివిటి రేటు 96.92 శాతంగా ఉంది. 

దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,29,71,308 కు చేరింది. ఇందులో కోలుకున్న వారి సంఖ్య 4,24,06,150 కు పెరిగింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 1,79,13,41,295 కరోనా వ్యాక్సిన్ల డోసులు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement