Friday, May 3, 2024

India Corona: దేశంలో కొత్తగా 5476 కరోనా కేసులు.. 158 మరణాలు

దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా తగ్గిపోయింది. రోజువారీ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 5476 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దేశంలో 158 మంది కరోనాతో మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య 5,15,036కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 9,754 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 59,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,29,62,953కు చేరింది. ఇందులో 4,23,88,475 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,78,83,79,249 మందికి కరోనా వ్యాక్సిన్లు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement