Tuesday, April 30, 2024

Covid-19: దేశంలో కొత్తగా 1421 కేసులు.. 149 మరణాలు

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. నిన్నటితో పొల్చితే తాజా కేసుల కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,421 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,30,19,453 కు చేరింది. కోవిడ్ తో 149 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,21,004కి పెరిగింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,826 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 4,24,82,262కు చేరింది. దేశంలో ప్రస్తుతం 16,187 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశం లో కరోనా పాజిటివిటి రేటు 89.16 శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 1,83,20,10,030 మందికి కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement