Monday, April 29, 2024

Covid: దేశంలో భారీగా పెరిగిన కరోనా.. 24 గంటల్లో 442 మంది మృతి

దేశంలో కరోనా మహమ్మారి కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రతిరోజు లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశంలో 1,94,270 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 442 మంది ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మరణాల సంఖ్య 4,84,655కి చేరింది. గడిచిన 24 గంటల్లో 60,405 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 9,55,319 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 11.05 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,60,70,510కి చేరాయి. ఇందులో 3,46,30,536 మంది పూర్తిగా కోలుకున్నారు. కాగా, నిన్నటితో పోలిస్తే 15.8శాతం కేసులు అత్యధికంగా నమోదు కావడం గమనార్హం. మంగళవారం 1.68లక్షల కరోనా కేసులు వెలుగు చూసిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement