Saturday, May 11, 2024

దేశంలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే..

దేశంలో కొత్తగా నిన్న‌ 37,154 క‌రోనా కేసులు వెలుగుచూశాయి. అలాగే, 24 గంట‌ల్లో 39,649 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,08,74,376కు చేరింది. మరణాల విషయానికొస్తే, నిన్న‌ 724 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,08,764కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,00,14,713 మంది కోలుకున్నారు. 4,50,899 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. దేశంలో ఇంతవరకు 37,73,52,501 వ్యాక్సిన్ డోసులు వేశారు. నిన్న 12,35,287 డోసులు వేశారు.

ఇది కూడా చదవండి: సమ్మేటివ్, ఫార్మేటివ్‌ పరీక్షల ఆధారంగా పదో తరగతి గ్రేడ్లు..

Advertisement

తాజా వార్తలు

Advertisement