Monday, May 6, 2024

పెరిగిన కేసులు.. దేశంలో కొత్తగా 8329మందికి కరోనా

గత రెండు రోజులుగా ఏడు వేలకు పైగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య ఈరోజు 8 వేలు దాటింది. గత 24 గంటల్లో కొత్తగా 8,329 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసులు 4,32,13,435కు చేరాయి. ఇందులో 4,26,48,308 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,757 మంది మరణించగా, మరో 40,370 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 10 మంది మరణించగా, 4,216 మంది వైరస్‌నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 3081 కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే కేరళలో 2415 కేసులు, ఢిల్లీ 655, కర్ణాటక 525, హర్యానాలో 327 చొప్పున నమోదయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement