Friday, March 29, 2024

Spl Story: శివ నామ స్మరణతో మారుమోగనున్న హిమగిరులు.. అమర్​నాథ్​ యాత్రకు అంతా సిద్ధం

ఎటుచూసినా మ‌ల్లెపువ్వులా మెరిసిపోయే హిమ‌సోయ‌గాలు.. క‌నుచూపుమేర ప‌రుచుకున్న మంచు.. అటు, ఇటు మంచుకొండ‌లు, లోయ‌లు, ఎత్తైన కొండ‌ల‌పై ప్ర‌యాణం.. పైకి వెళ్లిన కొద్ది ఊపిరి ఆడ‌కుండా ఉన్నా.. శివ‌నామ స్మ‌ర‌ణ‌తో అదోలోకంలో తేలిపోతూ ఉంటారు. అయితే.. ఇదో సాహ‌స యాత్ర అనే చెబుతుంటారు చాలామంది. అయినా ఆ భోళాశంక‌రుడిని, హిమలింగాన్ని క‌నులారా చూసి, త‌రించిపోవాల‌ని చాలామంది తాప‌త్ర‌య‌ప‌డుతుంటారు. అదే అమ‌ర్‌నాథ్ తీర్థ‌యాత్ర‌..

కరోనా కారణంగా రెండేళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది అమర్ నాథ్ తీర్థ యాత్ర. ఈ ఏడాది కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ ఈ యాత్రను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే.. ఈసారి అమర్​నాథ్​ యాత్ర జూన్ 30 నుంచి ప్రారంభం అవుతుందని అధికారులు తెలిపారు. అప్పటి నుంచి ఆగస్టు 11 దాకా యాత్ర కొనసాగుతుందని చెబుతున్నారు. కాగా ఈ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 11వ తేదీ నుంచే మొదలయ్యాయి. అమర్ నాథ్ యాత్రకు సుమారుగా 3 లక్షల మంది భక్తులు రావొచ్చని అమర్ నాథ్ పుణ్యక్షేత్రం బోర్డు అంచనా వేసింది. ఇక యాత్ర అతి తొందరలోనే ప్రారంభం కానుండడంతో అధికారులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమర్ నాథ్ యాత్రికుల భద్రత విషయంలో పోలీస్ యాంత్రంగం కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ప్రయాణికులను దృష్టిలో ఉంచుకుని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం ఈసారి నోటిఫికేషన్ జారీ చేసింది. అమర్ నాథ్ యాత్రికులు ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే వారు ఆధార్ కార్డు లేదా Aadhaar Proof అందించాల్సి ఉంటుంది.

ఈ నోటిఫికేషన్ జారీచేసినప్పటి నుంచి నిర్దిష్ట మార్గదర్శకాలను పాటించాలని అధికారులు వెల్లడిచేస్తున్నారు. కాగా, రెండేళ్ల తర్వాత అమర్ నాథ్ యాత్ర జరగబోతోంది. ఇది జూన్ ౩౦వ తేదీన ప్రారంభమై ఆగస్టు 11 వరకు కొనసాగుతుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గురువారం అమర్ నాథ్ యాత్ర ఏర్పాట్లపై సమీక్షించారు.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలోని ముఖ్యాంశాలు..

- Advertisement -
  1. అన్ని పనులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి.
  2. అధికారులు ప్రయాణ భద్రత కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని (Technology) ఉపయోగించాల్సి ఉంటుంది.
  3. అధికారులు భద్రతా ఏర్పాట్లను సకాలంలో తనిఖీ చేయాలి.
  4. రవాణా, వసతి, పరిశుభ్రత, విద్యుత్తు, నీరు, ఆరోగ్యం, దుకాణాలు, ఆహార సదుపాయాల కల్పన వంటి అంశాలపై గవర్నర్​ సమీక్షించారు.

ఇక.. అమర్ నాథ్ యాత్రకు ముందు మళ్లీ ఉగ్రదాడి జరుగుతుందనే భయం చాలామందిని వెంటాడుతోంది. శ్రీనగర్ లోని బెమినా ప్రాంతంలో ఇద్దరు లష్కరే తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ పోలీసు గాయపడ్డారు. ఈ విషయాన్ని పోలీసులు తెలియజేశారు. కశ్మీర్ జోన్ పోలీసుల కథనం ప్రకారం.. సోపోర్ ఎన్‌కౌంటర్ సమయంలో తప్పించుకున్న బృందంగా వారు అనుమానిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement