Sunday, April 28, 2024

HYD: ఘోర రోడ్డుప్రమాదం.. ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

ఘోర రోడ్డుప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ పరిధిలోని నార్సింగి దగ్గర చోటుచేసుకుంది. నార్సింగిలోని సీబీఐటీ దగ్గర విద్యార్థులు ప్రయాణిస్తున్న కారును టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement