Sunday, April 28, 2024

ఢిల్లీ హైకోర్టు న్యాయ‌మూర్తి ప‌దవికి స్వ‌లింగ సంప‌ర్కుడు..జస్టిస్ ఎన్వీ రమణ సిఫార్స్..

జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు…సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాతి నుంచి దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. తాను స్వలింగ సంపర్కుడినని గతంలో బహిరంగంగా ప్రకటించుకున్న సీనియర్ న్యాయవాది సౌరభ్ కిర్‌పాల్‌ను జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజయం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫార్సు చేసింది.గతంలో 2017, 2018, 2019 జనవరి, ఏప్రిల్ నెలల్లో సౌరభ్ పేరును పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఆచరణలోకి రాలేదు.

కేంద్ర నిఘా విభాగం ఆయనను స్వలింగ సంపర్కుడిగా ప్రస్తావించకుండా, ఆయన భాగస్వామి విదేశానికి చెందిన వ్యక్తని, స్విస్ రాయబార కార్యాలయంలో పనిచేస్తుండడంతో ఆయన నియామకం దేశ భద్రతకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉందని హెచ్చరించింది.ఫలితంగా సౌరభ్ సీనియర్ న్యాయవాదిగానే ఉండిపోయారు. దీనికి కనుక కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇస్తే దేశంలో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన తొలి స్వలింగ సంపర్క వ్యక్తిగా సౌరభ్ కిర్‌పాల్ రికార్డులకు ఎక్క‌డం ఖాయం. మ‌రి ఏం జ‌ర‌గ‌నుందో చూడాలి. తాజాగా, జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఆయనను హైకోర్టు న్యాయమూర్తి పదవికి సిఫారసు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement