Monday, April 29, 2024

హిమాచల్‌ప్రదేశ్ సీఎంకు కరోనా పాజిటివ్..

దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు మళ్లీ పుంజుకుంటున్నాయి. ప‌లు రాష్ట్రాల్లో మ‌ళ్లీ క‌రోనా కేసులు న‌మోద‌వుతున్నాయి. తాజాగా.. హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్ సుఖుకు కరోనా వైరస్‌ సోకింది. రెండు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం ఉండటంతో ఆయన కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో ఇటీవల తనతో సన్నిహితంగా మెలిగిన పార్టీ నేతలు, కార్యకర్తలు, అధికారులు జాగ్రత్తలు పాటించాలని సుఖ్విందర్‌ సూచించారు.
ఇటీవల జరిగిన హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘన విజయం సాధించింది. ఇటీవ‌లే సుఖ్విందర్‌ సింగ్‌ సుఖుకు ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement