Sunday, April 28, 2024

Flash: అసెంబ్లీ కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం

అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. సింగిల్ బెంచ్ ఆర్డర్‌ను సవాలు చేస్తూ నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఈరోజు జస్టిస్ ఉజన్ బయల్ బెంచ్ విచారణ చేపట్టింది. హైకోర్టు ఇచ్చిన నోటీసును తీసుకోనందుకు అసెంబ్లీ కార్యదర్శి పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రిజిస్టర్‌ను నేరుగా అసెంబ్లీకి వెళ్లి అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే హైదరబాద్ సీపీకి కూడా నోటీసులు అందజేయాలని స్పష్టం చేసింది. అసెంబ్లీకి వెళ్ళే ముందు ఫోన్‌లో ముందే సమాచారం ఇవ్వాలని రిజిష్టర్‌కు సూచించింది. సాయంత్రం 4 గంటలలోపు నోటీసుల అంశంపై నివేదిక ఇవ్వాలని రిజిష్టర్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement