Friday, March 29, 2024

ఏపీ అసెంబ్లీ నుంచి ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. అయితే ఈరోజు ఉదయం సభ ప్రారంభమైనప్పటి నుంచి టీడీపీ సభ్యులు నిరసన తెలుపుతున్నారు. జంగారెడ్డి గూడెం సంఘటనపై టీడీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తూ.. వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం ఐదుగురు టీడీపీ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండైన వారిలో అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, బాల వీరాంజనేయస్వామిలను స్పీకర్ సస్పెండ్ చేశారు. టీడీపీ సభ్యులను సభ నుంచి బయటకు తీసుకెళ్లాలని స్పీకర్ మార్షల్స్ ఆదేశించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement