Saturday, April 20, 2024

సిద్దిపేట‌లో బ‌యో సీఎన్‌జీ ప్లాంట్ ప్రారంభించిన హ‌రీశ్‌రావు

గతంలో సిద్దిపేట అంటే.. నలు దిక్కులా చెత్తతో క‌నిపించే ప్ర‌దేశాలుండేవి. సిద్దిపేటలో చెత్త కుప్పలు ఉండకూడదనే ఉద్దేశంతోనే బయో-CNG ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌ రావు అన్నారు. సిద్దిపేట రూర‌ల్‌ మండలం బుస్సాపూర్‌లో సోమవారం బయో-సీఎన్‌జీ ప్లాంట్‌ను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్ట‌ర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. బయో-CNG ఏర్పాటుకు బలం, బలగం సిద్దిపేట పుర ప్రజలని పేర్కొన్నారు. చెత్తను తడి, పొడి, హానికారక చెత్తను విభజన చేయడం వల్లే బయో – CNG ఏర్పాటు సాధ్యం అయ్యిందన్నారు. అభివృద్ధి అంటే..ఆరోగ్య వాతావరణంలో జీవించే గలిగే పరిస్థితులను సృష్టించడమని స్పష్టం చేశారు. చెత్తను ఆదాయ వనరుగా మార్చుతున్నాం. బయో – CNG గ్యాస్ ను పట్టణంలో రెస్టారెంట్లకు సరఫరా చేస్తాం. మున్సిపల్ వాహనాలకు ఇంధనంగా బయో – CNG గ్యాస్ ను ఉపయోగిస్తామని మంత్రి హ‌రీశ్‌రావు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement